చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలి – జోగి రమేష్

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. అసెంబ్లీలో ఏ అంశం మీదనైనా చర్చకు రెడీ అని స్పష్టం చేశారు. సంక్షేమం, సామాజిక న్యాయం అంటే అంటే ఏంటో సీఎం జగన్ చేతల్లో చూపించారని పేర్కొన్నారు. 32 పథకాలతో సీఎం జగన్ ప్రజల మన్ననలు పొందారని చెప్పారు.

jogi ramesh

త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధమా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. చంద్రబాబు సైతాన్ గా మారి తిరుగుతున్నాడని ఆరోపించారు జోగి రమేష్. చంద్రబాబు బీసీలను బానిసలుగా మార్చాడని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో బీసీలకు ఏం చేశాడని ప్రశ్నించారు. మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ డైలాగులు రాసిస్తే పాదయాత్రలో లోకేష్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news