కేటీఆర్ ఇలాగే మాట్లాడితే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే రోజులు వస్తాయి: మల్లాది విష్ణు

-

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మల్లాది విష్ణు.కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ ది బెస్ట్ సిటీ అని, సంక్రాంతికి సొంత ఊళ్లకు పోయినా తన ఫ్రెండ్స్ ఈ విషయాలు చెప్పారని అన్నారు.ఆంధ్రప్రదేశ్ లో కరెంటు లేదు, చీకట్లు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమయ్యాయి, తిరగడానికి లేదని..వాళ్లు చాలా నరకం లో ఉన్నట్టుగా ఆవేదన చెందారని, మళ్లీ హైదరాబాద్ కు వచ్చే వరకు ప్రశాంతంగా ఉండలేకపోయాము అన్నారని, వాళ్లకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది తెలంగాణలో డెవలప్మెంట్ ఎలా ఉందో అని అన్నారు మంత్రి కేటీఆర్..అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.

అభివృద్ధి అంటే ఏమిటో ఒకసారి విజయవాడకు వచ్చిి చూస్తే తెలుస్తుందని ఆయన కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.కోస్తా ఆంధ్ర ప్రజలు వెళ్లి తెలంగాణ, హైదరాబాదులో ఉన్నారు కాబట్టే అక్కడ అభివృద్ధి జరిగిందని మల్లాది విష్ణు అన్నారు.తెలంగాణకు కల్చర్ నేర్పి..డబ్బులు పెట్టుబడి పెట్టినందువల్లే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు.అయితే కొందరి రెండు కళ్ళ సిద్దాంతం మూలంగా రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చిందన్నారు.తమ ప్రభుత్వానికి వచ్చినన్ని అవార్డులు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాయా? అని ప్రశ్నించారు.హైదరాబాద్ ను చూసి మురిసిపోతున్నారని, అది సరైన పద్ధతి కాదని కేటీఆర్ కు చురకలంటించారు.ఇలాగే మాట్లాడితే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news