కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులను కూల్చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి

-

సంగారెడ్డిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులను కూల్చేస్తామన్నారు. దేశంలోనే దరిద్రమైన పాలన అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అన్నారు. రేవంత్ రెడ్డి ముఖం చూడలేక కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు అంటూ మండిపడ్డారు. మేము గేట్లు తెరిస్తే.. ఎమ్మెల్యేలుగా ఉన్న సభ్యులు తప్ప బీఆర్ఎస్ లో ఎవ్వరూ మిగలరు అని ఆయన చెప్పుకొచ్చారు.

మరో మూడు నెలల్లో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందని తెలిపారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదిగిన రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సీఎం అయ్యారు. సొంత బిడ్డ జైలుకు వెళ్తే.. కేసీఆర్ తాను చేసిన పాపాలకు ప్రయశ్చిత్తం చేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. యాదాద్రి థర్మర్ పవర్ ప్లాంట్ వ్యవహారంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్తారు. రావులు అందరూ జైలుకు వెళ్తే చర్లపల్లి జైలు సరిపోదు.. ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్ను పోటు పొడిచిన వ్యవహారంలో కేసీఆర్ కూడా ఉన్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news