నన్ను తిడితే మీరు పెద్దవాళ్లు అయిపోతారా?: కేసీఆర్

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటన్నా మంచి పని చేస్తోందా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలను ప్రశ్నించారు.ఛలో నల్లగొండ సభలో పాల్గొన్నా కేసీఆర్‌ మాట్లాడుతూ… కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలపై మండిపడ్డారు. కొందరు మంత్రులు సోయితప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రమే మంచిగా ఉందని ఉత్తమ్ అంటున్నారని ఫైరయ్యారు.ఉమ్మడి రాష్ట్రమే మంచిగుండే.. ఇప్పుడు మంచిగలేదట. ఇదే జిల్లాలో ఉన్న బిడ్డ శ్రీకాంత చారి ఎందుకు చనిపోయిండు.. ఉద్యమకారులు ఎందుకు చనిపోయారు ? అంతపెద్ద ఉద్యమం ఎందుకు జరిగింది ? లక్షలు, కోట్ల మంది ఎందుకు పాల్గొన్నరు ? ఇంత సోయితప్పి మంత్రులు మాట్లాడుతున్నరు’ అంటూ కేసిఆర్ మండిపడ్డారు.కేసీఆర్ను తిడితే మీరు పెద్దవాళ్లు అయిపోతారా? అంటూ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. వారికి పదవులు, పైరవీలు, పైసలే కావాలని, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని దుయ్యబట్టారు.

 

కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. ‘నంగనాచి అభాండాలతో తప్పించుకుంటే వదిలేది లేదు. చూస్తూ కూర్చోవడానికి ఇది మునుపటి తెలంగాణ కాదు.. ఇది టైగర్ తెలంగాణ అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news