IND, AUS ఫైనల్ కు అంపైర్లు వీరే ? ప్చ్.. మళ్ళీ అతడొచ్చాడు ?

-

పాత ప్రత్యర్ధులు మళ్ళీ ఈ వరల్డ్ కప్ ఫైనల్ లో తలపడుతున్నారు. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియం లో జరగనున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇరు జట్లు కప్ కోసం హోరాహోరీగా పోటీ పడనున్నారు. ఈ వరల్డ్ కప్ లో చూసుకుంటే ఇండియా కు మెరుగైన రికార్డు ఉండడం కలిసొచ్చే అంశమే. కాగా ఈ మ్యాచ్ కు గాను ఎందరో ప్రముఖులు స్టేడియం కు రానున్నారు. ఈ మ్యాచ్ కోసం వందల కోట్ల మంది క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వరల్డ్ కప్ ఫైనల్ కు అంపైర్ లుగా ఎవరు చేయనున్నారన్నది బీసీసీఐ ప్రకటించింది. ఫీల్డ్ అంపైర్ లుగా రిచర్డ్ కెటిల్ బరో మరియు రిచర్డ్ కిల్లింగ్ వార్త లు చేయనుండగా, థర్డ్ అంపైర్ గా జోయెల్ విల్సన్ మరియు మ్యాచ్ రిఫరీ గా ఆండీ ఫై క్రాఫ్ట్ చేస్తున్నారు.

మరి రిచర్డ్ కెటిల్ బరో సెంటిమెంట్ ను ఎవ్వరూ మరిచిపోయి ఉండరు.. ఇప్పుడు మళ్ళీ అందరూ అదే విషయం ఆలోచిస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news