IND vs SL T20: రేపటినుండి ఇండియా – శ్రీలంక సిరీస్

-

ఇండియా – శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మూడు టి20 లు, 3 వన్డేల సిరీస్ రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా తొలి టీ20 రేపు ముంబైలోని వాంకడే వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో టీం ఇండియా జట్టు మొత్తం మైదానానికి చేరుకుంది. ఈరోజు జట్టు ప్రాక్టీస్ చేయనుంది. రేపటి మ్యాచ్ తో ఇండియన్ ఓపెనర్ శుభమన్ గిల్ టి20 ఫార్మాట్ లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

ఈ సిరీస్ కి సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వగా.. హార్థిక్ పాండ్యా కెప్టెన్సీ చేయనున్నాడు. గుర్రాలతో కూడిన చెట్టును హార్దిక్ పాండ్యా ఎలా నడిపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. వైస్ కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news