ఇండియాలో కరోనా అప్డేట్… కొత్తగా 30,256 కేసులు

-

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. రోజు రోజుకు పెరగడమే తప్ప తగ్గుదల కనిపించడం లేదు. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు మళ్ళీ విజృంభిస్తున్నాయి. ఇక నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు…ఇవాళ మాత్రం తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30,256 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో దేశ వ్యాప్తం గా మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,478, 419 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,18,181 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 295 మంది కరోనా తో మరణించగా మృతుల సంఖ్య 4,45,133 కి చేరింది.

ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 80,85,68,144 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 37,78,296 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 43,938 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,27,15,105 కు చేరింది.

 

Read more RELATED
Recommended to you

Latest news