Bigg Boss 5: అంద‌రూ ఊహించిన‌ట్టే.. భాగ్యం అవుట్‌! అయినా అస‌ల్ త‌గ్గ‌లే..

-

Bigg Boss 5: బిగ్‌బాస్‌ 5వ సీజన్‌ వియవంతంగా కొన‌సాగుతుంది. రోజురోజుకు ఆట ర‌స‌వత్త‌రంగా మారుతుంది. రెండో వారం మాత్రం.. కంటెస్టెంట్ల మ‌ధ్య నానా ర‌చ్చ జ‌రిగింది. ఇక తొలివారం ఎలిమినేషన్స్‌లో అనూహ్యంగా సరయు ఎలిమినేట్ అయ్యింది. ఇక రెండో వారంలో ఎలిమినేష‌న్ మాత్రం అంద‌రూ ఊహించిన‌ట్లే జ‌రిగింది.

రెండో వారం నామినేష‌న్ లో యానీ మాస్టర్, ఉమాదేవి, నటరాజ్, ప్రియాంక సింగ్, ప్రియ, ఆర్జే కాజల్, లోబోలు ఉండ‌గా.. ఎలిమినేట్‌ అయ్యేది మాత్రం ఉమాదేవినే అంటూ సోషల్‌ మీడియాలో వార్తలు తెగ వైర‌లయ్యింది. ఈ వార్తలను నిజం చేస్తూ బిగ్‌బాస్ రెండో ఎలిమినేష‌న్‌లో కార్తీక దీపం ఫేమ్ భాగ్యం (ఉమాదేవి) ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. దీంతో హౌస్ నుంచి భాగ్యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో బిగ్‌బాస్‌ 5వ సీజన్‌కు సంబంధించి రెండో ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది.

ఎలిమినేష‌న్ లో చివ‌రిగా నటరాజ్ మాస్టర్, ఉమాదేవి ల‌కు గ‌ట్టిపోటీ ఎదురైంది. ఎలిమినేషన్ నుండి సేఫ్ కావడంతో నటరాజ్ మాస్టర్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఉమాదేవి బయటకు నవ్వుతూ వచ్చింది.

ఎలిమినేష‌న్ అనంత‌రం ఉమ త‌న‌దైన శైలిలో స్పందించింది. సిరికి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది. ఎవరి ఆట వాళ్లు వారే ఆడుకోవాలని సూచించింది. ఎదుటి వారి రియాక్షన్లను కూడా పట్టించుకోవాలని సలహా ఇచ్చింది. అనంత‌రం ల‌హ‌రి గురించి మాట్లాడుతూ.. లహరి చాలా వీక్ అని, ఎవరి సాయం లేకుండా.. షోలో ఆడాల‌ని సూచించింది.

ఇక ప్రియ సేఫ్‌గా ఆడుతోందని క‌డిగేసింది. రవిని కూడా చురకలు అంటించింది. అందరినీ దగ్గర తీసుకునే క్రమంలో మిగతా వారికి దూరం అవుతున్నావేమో అని తెలుసుకోవాల‌ని చెప్పింది. ఇక లోబో చూస్తూ వెక్కి వెక్కి ఏడిచింది. ఐ మిస్ యూ భంగు అంటూ భావోద్వేగానికి గురైంది. మన గురించి ఎంతో మంది ఎన్నో అనుకుంటారు.. కానీ మనం ఏంటో మనకు తెలుసు క‌న్నీటి ప‌ర్యంత‌మైంది.

Read more RELATED
Recommended to you

Latest news