ఇండియా కరోనా కేసులు జస్ట్ 36 వేలే…!

-

భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కరోనా కట్టడి చాలా వరకు జరిగింది అనే చెప్పాలి. గత 24 గంటల్లో దేశంలో 36,469 కొత్త కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. మొత్తం కేసులు 79,46,429 కు చేరుకున్నాయి. 488 కొత్త మరణాలు నిన్న నమోదు అయ్యాయి. మొత్తం మరణాలు 1,19,502 కు చేరుకున్నాయి. గత 24 గంటల్లో భారీగా కరోనా రోగులు కోలుకున్నారు.

6,25,857 యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి. మొత్తం రికవరీలు 72,01,070గా ఉన్నాయని కేంద్రం చెప్పింది. గత 24 గంటల్లో 63,842 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్నటి వరకు కరోనా కోసం మొత్తం 10,44,20,894 నమూనాలను పరీక్షించారు. వీటిలో 9,58,116 నమూనాలను నిన్న పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news