ఇండియాలో భారీగా తగ్గిన కరోనా..కొత్తగా 2.55 లక్షల కేసులు

-

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే.. ఇవాళ మాత్రం కరోనా కేసులు దారుణంగా పడిపోయాయి. నిన్న మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. తాజాగా.. ఆ సంఖ్య రెండు లక్షలకు పడి పోయింది.

ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2.55 లక్షల కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే నిన్న కరోనా పాజిటివిటీ రేటు.. 20.75 శాతంగా నమోదు అయితే… అది ఇప్పుడు 15.52 శాతానికి పడి పోయింది.

ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 7,23,619 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.62 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 614 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4.9 లక్షలకి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,55,874 మంది కరోనా నుంచి కోలు కున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news