లక్నో వేదికగా నేడు భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే మ్యాచ్

-

లక్నో వేదికగా ఇవాళ భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత జట్టు సఫారీలను ఢీ కొట్టనుంది. టీ20 సిరీస్ ఆడిన ఆటగాళ్లలో దీపక్ చాహర్‌ మాత్రం వన్డేలు ఆడనున్నాడు. మిగతా ఆటగాళ్లంతా వరల్డ్ కప్ కోసం నేడు (గురువారం) ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్లనున్నారు.

వరల్డ్ కప్ టీమ్‌లోని రిజ్వర్ ఆటగాళ్లతోపాటు ప్రపంచ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన ఆటగాళ్లు మాత్రమే సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడనున్నారు. మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్‌ తొలిసారి టీమ్ ఇండియా తరఫున ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2022లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన అతడు తొలి వన్డేలో బరిలోకి దిగే అవకాశం ఉంది. ‘కొత్త కుర్రాళ్లు ఉత్సాహంతో ఉన్నారు. వారు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు’ అని కెప్టెన్ శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు.

Read more RELATED
Recommended to you

Latest news