నువ్వా-నేనా… నేడు కివీస్‌-భారత్‌ మ్యాచ్‌

-

భారత్ – కివీస్ మధ్య జరగనున్న వన్డే మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది.హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు ఇప్పటికే ఆన్ లైన్ టికెట్ల విక్రయాలు ముగిశాయి. ఈ క్రమంలో 29 వేల టికెట్లను అమ్మినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకోగా రెండు టీం కెప్టెన్లు మీడియాతో మాట్లాడనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ క్రికెట్ సందడి కొనసాగుతోంది.గత సెప్టెంబర్ లో భారత్ , ఆస్ట్రేలియా మధ్య టీ20 అభిమానులను ఎంతగానో అలరించిన విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్, భారత్ క్రికెటర్లు నగరానికి వచ్చారు. నేడు ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

వన్డేలకు భారత జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్య (వైస్‌ కెప్టెన్), శుబ్‌మన్‌ గిల్, ఇషాన్‌ కిషన్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎస్ భరత్, రజత్‌ పాటిదార్‌, వాషింగ్టన్‌ సుందర్, షాబాజ్‌ అహ్మద్‌,శార్దూల్ ఠాకూర్‌, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్‌ యాదవ్‌,మహమ్మద్‌ షమి, మహమ్మద్‌ సిరాజ్‌,ఉమ్రాన్‌ మాలిక్.

న్యూజిలాండ్ జట్టు

టామ్ లాథమ్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, డగ్ బ్రేస్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, హెన్రీ సో షిప్లెన్, బ్లెయిర్ టిక్నర్.

 

Read more RELATED
Recommended to you

Latest news