క్లీన్ స్వీప్ పై టీమిండియా నజర్.. ఈరోజు వెస్టిండీస్ తో మూడో టీ20

-

టీంమిండియా క్లీన్ స్వీప్ పై నజర్ పెట్టింది. ఇప్పటికే మూడు టీ20 మ్యాచుల్లో రెండింటిలో భారత్ ఘన విజయం సాధిాంచింది. మూడో టీ20 ఈరోజు కలకత్తా ఈడెన్ గార్డెన్ వేదికగా జరగనుంది. ఇప్పటికే రెండు విజయాలతో సిరీస్ భారత్  సొంత అయింది. అయితే ఈ టీ20 కూడా భారత్ విజయం సాధించాలని అనుకుంటుంది. దీంతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలనే ప్లాన్ లో ఉంది. వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ ను టీం ఇండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే స్లార్ల బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ మూడో టీ20 కి అందుబాటులో లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. ఈ ఇద్దరు రెండో టీ20లో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇద్దరూ కూడా హఫ్ సెంచరీలు చేశారు. అయితే వీరి స్థానంలో వస్తున్న యువ బ్యాటర్లతో ఇండియా టీం సమతూకంగా కనిపిస్తోంది. మరోవైపు వెస్టిండీస్ బ్యాటర్లు కూడా భారీ ఇన్సింగ్స్ ఆడుతున్న విజయానికి దూరంగానే ఉంటున్నారు. రెండో టీ20లో వెస్టిండీస్ బ్యాటర్లు పూరన్, పావెల్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడినా.. విజయం దక్కలేదు. ఈ టీ20లో అయినా.. గెలిచి పరువు దక్కించుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. 

జట్ల అంచానా:

ఇండియా: రోహిత్ శర్మ (c), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (wk), శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్/శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్/కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్

వెస్టిండీస్:  బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (WK), రోవ్‌మాన్ పావెల్, కీరన్ పొలార్డ్ (c), జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, షెల్డన్ కాట్రెల్.

Read more RELATED
Recommended to you

Latest news