అండ‌ర్-19 ఆసియా క‌ప్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్

-

అండ‌ర్ – 19 ఆసియా క‌ప్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆసియా క‌ప్ లో భాగంగా శ్రీ లంక‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఈ ఫైన‌ల్ మ్యాచ్ లో పలు సార్లు వర్షం అడ్డ‌గించింది. దీంతో అంపైర్లు డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప్రకారం ఇండియాను విజేత గా ప్ర‌క‌టించారు. దీంతో అండ‌ర్ – 19 ఆసియా కప్ ను టీమిండియా కైవ‌సం చేసుకుంది.

కాగ ఈ మ్యాచ్ లో మొద‌ట టాస్ గెలిచి శ్రీ‌లంక బ్యాటింగ్ ఎంచుకుంది. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ను 39 ఓవ‌ర్ల‌కు కుదించారు. దీంతో నిర్ణిత 39 ఓవ‌ర్ల‌లో శ్రీ‌లంక 106 ప‌రుగులు చేసింది. దీని త‌ర్వాత టీమిండియా 107 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో టీమిండియా భ‌రీలోకి దిగింది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమ‌యంలో ఓపెన‌ర్ హ‌ర్నూర్ సింగ్ (5) ప‌రుగుల‌కే అవుటు కావ‌డంతో క‌ష్ట‌ల్లో ప‌డింది. అయితే మ‌రో ఓపెన‌ర్ ర‌ఘువంశీ అర్థ శ‌త‌కంతో రాణించ‌డంతో టీమిండియా ఆసియా కప్ ను స్వాధీనం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news