IND VS PAK : నేడు పాక్‌ ను ఢీ కొట్టనున్న టీమిండియా

-

నేడు పాక్‌ ను ఢీ కొట్టనుంది టీమిండియా. టి20 ప్రపంచ కప్ ను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగనున్న భారత మహిళల జట్టు నేడు గ్రూప్ ‘బి’ తోలిపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడుతుంది. కీలకమైన పోరుకు ముందు డాషింగ్ ఓపెనర్ స్మృతి మందాన, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఫిట్నెస్ సమస్యలు జట్టును సతమతం చేస్తున్నాయి.

తొలి మ్యాచ్ కు స్మృతి గాయంతో జట్టుకు దూరం అవడం బ్యాటింగ్ పై ప్రభావం చూపగలదు. అయితే ఇటీవల షఫాలీ వర్మ రిచా అండర్-19 ఈవెంట్ లో రాణించారు. ఇప్పుడు కూడా బాధ్యతను పంచుకుంటే ఆ సమస్యను అధిగమించవచ్చు. జమీమా, హర్లీన్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ మిడిలార్డర్ లో రాణిస్తే జట్టుకు ఢోకా ఉండదు. బౌలింగ్ లో రేణుక, షికా పాండే, దీప్తి శర్మ రాణిస్తే పాకిస్తాన్ పై భారత్ కు విజయం సులువవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news