IND VS SL : మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం

-

శ్రీలంక జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగానే శ్రీలంక జట్టుపై దుమ్ముదులిపే విజయాన్ని అందుకుంది టీమిండియా. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 574 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా… శ్రీలంకను తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులకు… అలాగే ఫాలో ఆన్ లో 178 పరుగులకు ఆలౌట్ చేసింది.

దీంతో టీమిండియా ఏకంగా 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక బ్యాట్స్మెన్ లకు ఇండియా బౌలర్లు చుక్కలు చూపించారు. రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా నాలుగు వికెట్లు తీయగా అటు రవీంద్ర జడేజా 4, మహమ్మద్ షమీ రెండు వికెట్లు తీసి శ్రీలంక బ్యాట్స్మెన్లను కట్టడి చేశారు. దీంతో టీమిండియా అవలీలగా విజయం సాధించింది. ఇక ఈ టెస్ట్ లో నాలుగు వికెట్లు తీసిన అశ్విన్… టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా రికార్డులకెక్కాడు.

Read more RELATED
Recommended to you

Latest news