వైరల్ వీడియో: సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులు

-

సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఆర్మీ ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంట భారీ కాల్పులకు దిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర దాడులు జరిగాయి అని భారత ఆర్మీ పేర్కొంది. ఇప్పుడు కుద సరిహద్దుల్లో కాల్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. నియంత్రణ రేఖ వెంబడి భారతీయ వైపు పౌరులు నివాస ప్రాంతాల్లో కాల్పులు జరపడంకు సంబంధించి వీడియో ఒకటి బయటకు వచ్చింది.

ఈ నెల ప్రారంభంలో, జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంట రెండు వేర్వేరు సంఘటనలలో పాక్ ఆర్మీ కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ సైనికులు మరణించారు. నౌగామ్ సెక్టార్లో, కుప్వారాలో పాకిస్తాన్ అప్రకటిత కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news