బ్రిటన్ రాణి ఎలిజబెత్- II కి ఘనంగా తుది వీడ్కోలు

-

బ్రిటన్‌ దివంగత మహారాణి ఎలిజబెత్‌-2 అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. లండన్​లోని వెస్ట్​మినిస్టర్ అబేలో రాణి అంత్యక్రియలు నిర్వహించారు. రాచరికపు సంప్రదాయాలతో వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచారవ్యవహారాలను పాటిస్తూ రాణికి తుది వీడ్కోలు పలికారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా వివిధ దేశాధినేతలు, రాజులు, రాణులు అంత్యక్రియలకు హాజరయ్యారు. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాణికి నివాళులు అర్పించారు.

సోమవారం ఉదయం 11 గంటలకు రాణి శవపేటికను వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో రాణి అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమైంది. వెస్ట్​మినిస్టర్ హాల్ నుంచి వెస్ట్‌మినిస్టర్‌ అబే వరకూ రాణి శవపేటికను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడి నుంచి 12.15 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర వెల్లింగ్టన్‌ అర్చి వరకు సాగింది.

అక్కడి నుంచి విండ్సర్స్‌ క్యాజిల్‌లోని సెయింట్‌ జార్జ్‌ చాపెల్‌కు రాణి శవపేటికను తీసుకెళ్లారు. ఈ అంతిమయాత్రలో కింగ్‌ ఛార్లెస్‌-3తోపాటు రాజ కుటుంబం పాల్గొంది. కింగ్‌ జార్జ్‌-6 మెమోరియల్‌ చాపెల్‌లోకి తీసుకెళ్లిన తర్వాత చివరగా రాయల్‌ వాల్ట్‌లో క్వీన్‌ ఎలిజబెత్‌ భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌ను ఉంచిన దగ్గరే రాణి శవపేటికను ఉంచారు. అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు.

Read more RELATED
Recommended to you

Latest news