ఐపిఎల్ 2023: ఢిల్లీ పై చెన్నై ఓడితే… ప్లే ఆఫ్ కు వెళుతుందా ?

-

ఈ రోజు ఐపిఎల్ లో భాగంగా జరగనున్న రెండు మ్యాచ్ లు ప్లే ఆఫ్ కు చాలా కీలకంగా మారనున్నాయి. మొదటి మ్యాచ్ లో ఢిల్లీ మరియు చెన్నై లు తలపడనున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ లో లేని ఢిల్లీ ఫ్రీ గా ఆడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం చెన్నై 7 మ్యాచ్ లలో గెలిచి 15 పాయింట్ లతో ప్లే ఆఫ్ కు అడుగు దూరంలో నిలిచి ఉంది. కానీ ఈ రోజు కనుక ఢిల్లీ పై చెన్నై ఓడితే ఖచ్చితంగా ప్లే ఆఫ్ కు చేరే అవకాశం తగ్గే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే లక్నో కూడా చెన్నై తో పాటు సమానంగా పాయింట్ కను సాధించి ఉంది. ఒకవేళ ఈ రోజు చెన్నై ఓడినా ప్లే ఆఫ్ కు వెళ్ళాలంటే మాత్రం… రాత్రి జరగనున్న మరో మ్యాచ్ లో లక్నో పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించి తీరాలి. అదే సమయంలో లక్నో కన్నా మెరుగైన రన్ రేట్ ను కలిగి ఉండాలి.

ఇక ముంబై మరియు గుజరాత్ ల మధ్య జరగనున్న మ్యాచ్ లో ముంబై ఒడిపోవాలి. ఇలా జరిగితేనే చెన్నై ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. ఈ ఫలితాలలో ఏది తారు మారు అయినా చెన్నై కి కష్టమే అని చెప్పాలి. అంత వరకు తెచ్చుకోకూడదు అనుకుంటే ఇంకాసేపట్లో మొదలు కానున్న మ్యాచ్ లో ఢిల్లీ పై గెలిస్తే చాలు. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news