IPL 2023: మోస్ట్ అవెయిటింగ్ మ్యాచ్ నేడే… “ధోనీ vs కోహ్లీ” పోరుకు సర్వం సిద్దం !

-

ఐపిఎల్ సీజన్ 16 ఉత్కంఠ భరితంగా సాగే మ్యాచ్ లతో అభిమానులను ఎంతగానో రంజింపచేస్తోంది. కొన్ని మ్యాచ్ లు అయితే ఆఖరి బంతి వరకు సాగుతూ నరాలు తెగే ఉత్కంఠను అందిస్తున్నాయి. ప్రతి జట్టు కూడా ఎంతో కసిగా ఐపిఎల్ సీజన్ 16 టైటిల్ ను అందుకోవాలని ఆడుతున్నాయి. కాగా ఈ రోజు సాయంత్రం బెంగళూర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్యన భారీ మ్యాచ్ జరగనుంది. ఎప్పుడూ ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయి. ఈసారి కూడా ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ మ్యాచ్ లో మాజీ ఇండియా టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరియు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ల మధ్యన జరిగే పోరు గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరు తన టీమ్ ను విజయపథంలో నడిపిస్తారు అని లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఐపిఎల్ లో బెంగళూర్ తాము ఆడిన 4 మ్యాచ్ లలో 2 గెలవగా 2 మ్యాచ్ లలో ఓడింది, అదే విధంగా చెన్నై ఆడిన 4 మ్యాచ్ లలో 2 గెలిచి 2 ఓడింది. ఇద్దరూ పాయింట్ల పరంగా సమానంగా ఉన్నా నెట్ రన్ రేట్ లో దెలపా తేడాతో చెన్నై 6 వ స్థానంలో మరియు బెంగళూరు 7 వ స్థానంలో ఉన్నాయి. మరి చూద్దాం ఇవాళ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ??

Read more RELATED
Recommended to you

Latest news