ఐపిఎల్ 2023: ఢిల్లీ దారుణ ఓటమి… !

-

ఈ రోజు కాసేపటి క్రితమే ముగిసిన ఢిల్లీ మరియు చెన్నై మ్యాచ్ లో ధోనీ సేన ఏకంగా 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసి ఆ ధోనీ సేన నిర్ణీత ఓవర్ లలో 167 పరుగులు చేయగా, లక్ష్య చేదనలో ఢిల్లీ కేవలం 140 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. గత మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన ఢిల్లీ ఈ మ్యాచ్ లో పూర్తిగా తేలిపోయింది. ఓపెనర్ ల దగ్గర నుండి కీ ప్లేయర్స్ అందరూ విఫలం కావడంతో ఓటమి చెందారు. ఒక దశలో మనీష్ పాండే మరియు రాసో లు భాగస్వామ్యాన్ని నమోదు చేస్తుంటే… పతిరణ అద్భుతమైన బంతితో పాండే ను ఔట్ చేసి ఢిల్లీ గేట్లు తెరిచాడు. ఆ తర్వాత ఏ దశలోనూ లక్ష్యం వైపు వెళ్లేలా కనిపించలేదు.

వార్నర్, మార్ష్, సాల్ట్, రసౌ మరియు మనీష్ పాండే లు ఆడకపోవడమే ఓటమికి కారణం. ఈ ఓటమితో దాదాపుగా ఇక ప్లే ఆఫ్ రేస్ నుండి ఢిల్లీ తప్పుకున్నట్లే. దీనితో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈ సీజన్ చాలా మరచిపోని గుర్తులను ఇచ్చిందని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news