ఐపీఎల్ 2023: జట్టు విజయం కోసం హార్దిక్ పాండ్య ఫినిషర్ గా రావాలి.. !

-

ఈ రోజు ముంబై మరియు గుజరాత్ జట్ల మధ్యన అహమ్మదాబాద్ లో క్వాలిఫైయర్ 2 జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఆదివారం జరగనున్న ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. కాగా క్వాలిఫైయర్ 1 లో చెన్నై తో గుజరాత్ టైటాన్స్ ఓడిపోవడంతో ఈ మ్యాచ్ లో ఒత్తిడితో బరిలోకి దిగనుంది. కాగా ఎప్పటిలాగే ఈ మ్యాచ్ లో గుజరాత్ ఆడితే కనుక ముంబై లాంటి బలమైన టీం పై విజయాన్ని సాధించగలదు. అందులో భాగంగా గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఇప్పటి వరకు ఫస్ట్ డౌన్ లో కొన్ని మ్యాచ్ లకు సుదర్శన్ రాగా, చాలా మ్యాచ్ లలో హార్దిక్ పాండ్య వచ్చాడు.

కానీ ఈ స్థానంలో హార్దిక్ పెద్దగా రాణించలేకపోయాడు. కనుక పాతప్పుడు ముంబై ఇండియన్స్ లో ఎలాగైతే ఫినిషర్ గా వచ్చి మ్యాచ్ లను ముగించేవాడో అదే విధంగా వస్తే జట్టుకు ఉపయోగం ఉంటుంది. మరి ఈ విషయంలో కోచ్ లు కూడా హార్దిక్ కు సూచనలు ఇస్తే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news