ఐపిఎల్ 2023: కోల్కతా ముందు ఛాలెంజింగ్ టార్గెట్ .. !

-

ఐపిఎల్ లో ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ మరియు కోల్కతా లు గెలవాలన్న కసితో బరిలోకి దిగారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది, అయితే ఒకానొక దశలో ఈ మాత్రం స్కోర్ అయినా చేస్తుందా అనిపించింది. కానీ చివరి ఓవర్ లో షారుఖ్ ఖాన్ మరియు బ్రార్ లు చెలరేగి అడి 21 పరుగులు పిండుకోవడంతో ఆ మాత్రం స్కోర్ చేసింది. పంజాబ్ లో ఒక్క శిఖర్ ధావన్ మాత్రమే 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక మిగిలిన అందరూ ఫెయిల్ అయ్యారు… ముఖ్యంగా రాజపక్స మరోసారి ఛాన్స్ ను వాడుకోవడంలో ఫెయిల్ అవ్వగా, పరిస్థితులకు తగ్గట్లు ఆడడంలో మిగిలిన బ్యాట్స్మన్ లు ఫెయిల్ అయ్యారు.

ప్రస్తుతం కోల్కతా ముందు 180 పరుగుల లక్ష్యం ఉంది. ఈ ఐపిఎల్ లో ప్లే ఆప్ పై ఆశలు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాలి. మరి ఏమి జరగనుంది అనేది తెలియాలంటే చేజింగ్ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news