ఐపీఎల్ 2023 : ముంబైకి భారీ షాక్.. మ్యాచ్ విన్నర్ అవుట్ !

-

ఈ రోజు ఐపీఎల్ లో భాగంగా చెన్నైలోనే చిదంబరం స్టేడియం లో జరుగుతున్న చెన్నై మరియు ముంబై మ్యాచ్ కు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముందుగా టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు, దేనితో రోహిత్ శర్మ సేన బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ముంబై ఇండియన్స్ టీం కు మరియు అభిమానులకు గట్టి షాక్ తగిలింది అని చెప్పాలి. గత సీజన్ నుండి ముంబై టీంలో అతి చిన్న వయసులోనే మ్యాచ్ లను గెలిపించగల సత్తా ఉన్న యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం గత రాత్రి నుండి జ్వరంగా ఉండడంతో ముంబై యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా గత మ్యాచ్ లో కీలక సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ముంబై కు విజయాన్ని అందించాడు. ఇప్పుడు ఇతని లేని లోటును ఎవరు భరిస్తారు అన్నది తెలియాలంటే మరికాసేపటి వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news