IPL 2024 : సన్ రైజర్స్ తో మ్యాచ్ కి ముందు ముంబై ఇండియన్స్ కి భారీ ఎదురుదెబ్బ ?

-

ముంబై ఇండియన్స్ జట్టుకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మార్చ్ 27 న ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ జట్టు తలబడనుంది. ఇక ఈ మ్యాచ్లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఆడే అవకాశాలు చాలా తక్కువ అని తెలుస్తోంది. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) నుంచి సూర్యకు ఇంకా ఎన్‌ఓసీ దక్కలేదని సమాచారం .

దాంతో గుజరాత్‌ టైటాన్స్ తో మ్యాచ్‌కు దూరమైన సూర్యకుమార్‌.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. గుజరాత్‌తో మ్యాచ్‌లో సూర్య లేని లోటు ముంబై ఇండియన్స్ లో స్పష్టంగా కనిపించింది. అతడు ఉండివుంటే ముంబై ఇండియన్స్ జట్టు సునాయాసంగా గెలిచేది. రేపటి మ్యాచ్‌కు కూడా అతడు దూరమైతే.. ముంబై విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. కాగా, ఐపీఎల్‌లో 139 మ్యాచులు ఆడిన సూర్య కుమార్ యాదవ్.. 3249 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సూర్య చాలా సంవత్సరాలుగా ముంబైకి ఆడుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news