IPL 2024 : ఆకట్టుకోలేకపోయిన ముంబై ఇండియన్స్ బ్యాటర్స్… చెలరేగిన రాజస్థాన్ బౌలర్లు

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా వాంటెడ్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ దారుణంగా విఫలమయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది.

 

ముంబై ఇండియన్స్ జట్టులోని ముగ్గురు బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, నమన్ ధిర్, బ్రేవిస్ గోల్డెన్ డక్ అవుట్ గా వెనిదిరిగారు. ఈ సమయంలో కష్టాల్లో ఉన్న ముంబై ని తిలక్ వర్మ ,హార్దిక్ పాండే ఆదుకున్నారు. తిలక్ వర్మ 32 పరుగులు చేయగా కెప్టెన్ పాండ్య 34 పరుగులు చేసి పర్వాలేదనిపించారు.  ముంబై బ్యాట్స్మెన్ లలో ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు. ఇక రాజస్థాన్ బౌలర్స్ లో ట్రెంటు బోల్టు, చాహల్ 3 వికెట్లు తీశారు. బర్జర్ 2 వికెట్లు, ఆవేష్ ఖాన్ ఒక్క వికెట్ తీశాడు.

Read more RELATED
Recommended to you

Latest news