వాస్తు: పిల్లల చదువు విషయంలో ఈ మార్పులు చేస్తే మంచిది..!

-

మన ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బంది లేదు అంటే తరచూ గొడవలు కలగడం లాంటివి. అయితే ఇలాంటి సమస్యలు ఏమి రాకుండా ఉండాలంటే వాస్తు ప్రకారం అనుసరించాలి. వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల ఏ ఇబ్బంది అయినా తొలగిపోతుంది అని వాస్తు పండితులు అంటున్నారు.

అయితే ఈ రోజు పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే తప్పకుండా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం పిల్లల విషయంలో ఈ విధంగా శ్రద్ధ తీసుకోవాలని పండితులు అంటున్నారు. పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళ యొక్క స్టడీ రూమ్ ఈశాన్యం వైపు ఉండేటట్టు చూసుకోవాలి అని అన్నారు.

అలానే ఎప్పుడూ కూడా పిల్లలు గది శుభ్రంగా ఉండాలి. స్టడీ టేబుల్ మీద క్రిస్టల్ గ్లోబ్ ని పెట్టుకుంటే మంచిది. క్రిస్టల్ గ్లొబ్ ని కనుక స్టడీ టేబుల్ మీద పెడితే వాళ్లలో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే చాలా మంది స్టడీ టేబుల్ పైన పుస్తకాలను పెట్టేస్తుంటారు. అలా కాకుండా పుస్తకాలు టేబుల్ వేరేగా షెల్ఫ్ వేరేగా పెట్టుకోవడం మంచిది. ఇలా ఈ మార్పులు కనుక చేస్తే ఖచ్చితంగా పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది అలానే చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news