కిరాక్ ఆర్పి అన్న మాటలపై మొదటిసారి ఫైర్ అయినా జబర్దస్త్ కమెడియన్..?

-

గడిచిన ఒక వారం రోజుల క్రితం నుంచి ఎక్కువగా జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి.. జబర్దస్త్ పై పలు వాక్యాలు చేయడంతో సంచలనంగా మారుతూనే ఉన్నాయి. జబర్దస్త్ వీడడానికి గల కారణాలు తెలియజేస్తూ అందులో మల్లెమాల సంస్థ అలాగే శ్యాం ప్రసాద్ రెడ్డి పైన కూడా పలు వార్తలు మాట్లాడడం జరిగింది. అయితే ఈ వార్తలపై తాజాగా గెటప్ శీను లాంటివారు కిరాక్ పార్టీకి కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.

జబర్దస్త్ లో కొన్ని సంవత్సరాల పాటు కమెడియన్ గా కొనసాగిన కిరాక్ ఆర్పి ఆ తర్వాత నాగబాబు వెంట బయటికి వచ్చి అదిరింది, కామెడీ స్టార్స్ వంటి ప్రోగ్రాంలో చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మల్లెమాల అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డి పై కూడా పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక గతంలో చమ్మక్ చంద్ర, వేణు, ధనరాజ్ తదితరులు జబర్దస్త్ ను వీడడం జరిగింది కానీ వీరు మాత్రం ఇంతవరకు జబర్దస్త్ వంటి షో పైన శ్యాం ప్రసాద్ రెడ్డి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ కిరాక్ ఆర్పి మాత్రం మల్లెమాల చాలా నీచమైన ప్రొడక్షన్ అంటూ శ్యాం ప్రసాద్ రెడ్డి ఒక డబ్బు వ్యక్తి మాత్రమే అంటూ తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది.

తాజాగా ఈ విషయంపై జబర్దస్త్ కమెడియన్ అయిన గెటప్ శీను స్పందించడం జరిగింది. ఆర్పి ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతున్నాడు తనకి అర్థం కాలేదని తాము ఎప్పటికీ జబర్దస్త్ బిడ్డలమే అన్నట్లుగా మాట్లాడాడు. కిరాక్ ఆర్ పి ని ఎంతోకొంత కాస్త గుర్తు పడుతున్నారు అంటే అది కేవలం జబర్దస్త్ పెట్టిన బిక్ష అని తెలియజేశారు. అసలు ఆర్పి కి శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడే రేంజ్ ఉందా అని కూడా ఫైర్ అవడం జరిగింది. ఇక అంతే కాకుండా అవకాశాల కోసం గేటు బయట నిలబడ్డప్పుడు నిన్ను ఎవరు లోపలికి పంపించారు? ఎవరు అవకాశాలు ఇచ్చారు? అనే విషయంపై కూడా గుర్తు చేసుకోవాలని ఫైర్ అయ్యారు. ఇక అంతే కాకుండా ప్రొడక్షన్ లో ఫుడ్ సరిగ్గా లేదని అంటున్నావ్.. మీ ఇంట్లో ఏదో ఒక రోజు కూడా ఫుడ్ సరిగ్గా బాగలేకపోవచ్చు అంతమాత్రాన అది చెత్త అనుకుంటే ఎలా అని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news