వైసీపీలోకి జబర్దస్త్ కమెడియన్స్.. రోజా మాస్టర్ ప్లాన్..!

-

ఇటీవల కాలంలో పరిస్థితులు ఏ విధంగా మారిపోతున్నాయో చెప్పడం కష్టంగా మారుతోంది. ఒకప్పుడు హీరోలు, హీరోయిన్లు, ప్రేక్షకులలో మంచి అభిమానం సంపాదించుకున్న వారు మాత్రమే రాజకీయాల్లోకి వెళ్లే వాళ్ళు. కానీ ఇటీవల కాలంలో బుల్లితెర షోల ద్వారా కూడా పాపులారిటీ దక్కించుకొని రాజకీయ రంగం వైపు అడుగులు వేస్తూ ఉండడం ఒకరకంగా ఆశ్చర్యమని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఇటీవల జబర్దస్త్ కు సంబంధించిన కమెడియన్ హైపర్ ఆది జనసేనకు సంబంధించిన యువశక్తి మీటింగ్లో పాల్గొని వైసిపి అధికారులపై మాట్లాడిన మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి.

పవన్ కళ్యాణ్ కు మద్దతుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పార్టీపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలు మరింత వైరల్ గా మారాయి. వైసిపి మంత్రులు కావాలని పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేస్తున్నారు అని… వివిధ రకాల శాఖలలో ఉన్నా సరే వాటి గురించి వారికి ఏమీ తెలియదు.. అందుకే పవన్ కళ్యాణ్ ను తిట్టడానికి ఒక శాఖను పెట్టుకోండి అని పంచ్ కూడా వేశాడు. అయితే రోజా కూడా అతనిపై ఊహించని స్థాయిలో కౌంటర్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది. అతడికి డైపర్ పెట్టుకునే సమయం వచ్చింది అని.. మీడియా ముందు ఫోన్ నెంబర్ కూడా ఇస్తూ ఊహించని విధంగా రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తారేమో అనే భయంతో మెగా హీరోలకు భయపడి వారికి మద్దతు ఇస్తున్నాడు అని రోజా కామెంట్ చేసింది. అంతేకాదు జబర్దస్త్ లో నాగబాబు కు వ్యతిరేకంగా అలాగే హైపర్ ఆదికి విరుద్ధంగా.. వైసీపీ కోసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి జబర్దస్త్ కమెడియన్లను హైపర్ ఆదికి పోటీగా రోజా రంగంలోకి దింపడానికి మాస్టర్ ప్లాన్ వేసిందని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కొంతమంది జబర్దస్త్ కమెడియన్లు చేరే అవకాశం ఉంది అని వారిలో ఒక ప్రేమ జంట కూడా హైపర్ ఆదిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news