నామా, పువ్వాడలకు ఫోన్‌లో సీఎం కేసీఆర్ అభినందనలు

-

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ నామా నాగేశ్వర రావు, మంత్రి పువ్వాడ అజయ్‌ లకు ఫోన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఖమ్మంలో బిఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతంగా నిర్వహించారని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పువ్వాడ అజయ్, నామ నాగేశ్వరరావులను అభినందించారు.

తన అంచనాలకు అనుగుణంగా ప్రభంజనంలా జనం వచ్చారని, ఖమ్మం చరిత్ర సృష్టించిందని తెలిపారు. సభ నుంచి హైదరాబాద్ చేరుకున్న అనంతరం పువ్వాడ నామాకు ఫోన్ చేశారు. జిల్లా నేతలంతా శ్రమించి, సమన్వయంతో, ప్రణాళిక బద్దంగా సభను నిర్వహించారని ప్రశంసించారు. కాగా, నిన్న ఖమ్మం బీఆర్‌ఎస్‌ పార్టీ సభ సక్సెస్‌ అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news