శభాష్ రోజా : చాలాకాలం తరవాత మెచ్చుకున్న జగన్ ?

-

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తో సొంత పార్టీలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సినిమా రంగం నుండి రాజకీయ రంగం వరకు అండగా ఉంటున్న దళితులు మరియు ముస్లిములు పవన్ కళ్యాణ్ మమ్మల్ని అందరినీ వెధవల్ని చేసి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని బీజేపీతో చేతులు కలపడం దారుణమని కామెంట్ చేస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ సంసారం చేతగానివాడు భార్యలను మార్చినట్లు పవన్ కళ్యాణ్ రాజకీయం చేతగాక ఆ పార్టీ ఈ పార్టీ భజన చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాలో.

Related image

ఇటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం గురించి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.  పవన్ కల్యాణ్ ను పొత్తుల కల్యాణ్.. ప్యాకేజ్ కల్యాణ్ అని చెప్పుకుంటారని.. అలాంటి ఆయన ప్యాకేజీల కోసమే పార్టీ పెట్టినట్లుగా ఆరోపించారు. పొత్తులు పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకుంటారన్న ఆమె.. ఈ కారణంతోనే పవన్ ను రెండుచోట్ల ప్రజలు ఓడించారన్నారు.

 

ఇలాంటి వారితో పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ పెద్దలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తనకు అర్థం కావటం లేదన్నారు. పవన్ తో పొత్తు అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడమేనని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. దీంతో వైయస్ జగన్..పవన్ కళ్యాణ్ పై చాలా రోజుల తర్వాత రోజా కరెక్ట్ పాయింట్లతో విమర్శలు చేసిందని శభాష్ అని మెచ్చుకునట్లు సమాచారం. 

 

 

Read more RELATED
Recommended to you

Latest news