రేపు ఏలూరులో ప‌ర్య‌టించ‌నున్న ఏపీ సీఎం జ‌గ‌న్‌..

-

సెప్టెంబ‌ర్ 30న సోమవారం తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 4వ తేదీన అంటే రేపు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకుంటున్న వారికి ఏడాదికి రూ.10 వేల చొప్పున వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద నగదు ప్రోత్సాహకాన్ని పంపిణీ చేయ‌నున్నారు. సీఎం పర్యటన కోసం ఏలూరులో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అయితే సీఎం పర్యటన సందర్భంగా ఇండోర్ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, తలశిల రఘురాం, జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు తదితరులు పర‍్యవేక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news