21 లక్షల మందిని జగన్ రోడ్డున పడేశారు: పవన్

-

ఒక్క ఎంఎల్ఏ లేకపోయినా దశాబ్ద కాలం పాటు పార్టీ బలంగా నడవటానికి జనసైనికులు, వీరమహిళలే కారణమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.గుంటూరు జిల్లా తెనాలిలో వారాహి విజయ భేరి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘వచ్చే నెల ఈ సమయానికి ఎన్నికలు అయిపోయి.. వైసీపీ దుష్టపాలనకు చరమగీతం పాడి ఉంటాం. పేదలకు నిజంగా జగన్ న్యాయం చేసి ఉంటే.. ఈ రోజు జనసేన-బీజేపీ-టీడీపీ కలిసి వచ్చేవి కాదు అని తెలిపారు.. ఇసుక దొరక్కుండా చేసి 21 లక్షల మంది కార్మికులను రోడ్డున పడేశారు’ అని పవన్ కళ్యాణ్ ఫైరయ్యారు.

వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రాగానే వ్యాపార వర్గాలకు అండగా ఉంటామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ఐదో తేదీలోపు జీతాలు ఇస్తామన్నారు. జగన్కు అధికార గర్వం తలకెక్కిందని, అందరినీ తన బానిసలుగా భావిస్తున్నారని మండిపడ్డారు. ఈ గర్వం ఉన్నవారిని ప్రజలే వెంటపడి తరుముతారని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news