జగనన్న తోడు’ రుణాలకు స్టాంపు డ్యూటీ మినహాయింపు

-

సంక్షేమ పథకాలతో దూసుకెళుతున్న జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధిపొందే వారికి స్టాంపు డ్యూటీని మినహాయిస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. బ్యాంకులు వసూలు చేసే స్టాంపు డ్యూటీ రద్దూ చేస్తూ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా పదిలక్షల మందికి ప్రయోజనం చేకూరతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Jagan
Jagan

ఈ ఫథకం పై గ్రామ, వార్డు సచివాలయ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వివరించారు. రుణం తీసుకునేవారు ఒక్కొక్కరికి రూ.324 చొప్పున.. మొత్తంగా రూ. 32 కోట్లు ప్రభుత్వం భరిస్తుందని ఆయన వెల్లడించారు.అసంఘటిత రంగంలోని చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ఏపీ సర్కార్ జగనన్న తోడు రుణాలను ప్రవేశపెట్టింది.

 చిరు వ్యాపారులు,  కూరగాయలు, వస్తువులు అమ్మేవారు, తోపుడు బండ్లపై విక్రయాలు జరిపేవారు, ఇత్తడి పాత్రల తయారీదారులు, టిఫిన్ సెంటర్లు, కలంకారీ పనులు చేసే వారికి.. ఇలా వివిధ రంగాల్లోని వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని ఆయన వెల్లడించారు.మొదటి విడతలో భాగంగా దాదాపు 10 లక్షలమందికి రూ.1,000 కోట్ల రుణాలు మంజూరు చేశారు. వీటికి ప్రతి సంవత్సరం రూ.60 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు అయ్యే ఇంట్రస్ట్‌ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున 10 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో వారం, పది రోజుల్లో డబ్బులు జమ కానున్నాన్నట్లు తెలిపారు. రుణాలు తీసుకున్న వారు గుర్తింపు కార్డులు తీసుకొని, ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి. ఈ లోన్స్ గడువులోగా చెల్లిస్తే మళ్లీ వడ్డీ లేకుండా రుణాలు తీసుకోవచ్చని పేర్కొన్నారు.

అయితే ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది..కాని అవి ప్రతి లబ్ధిదారుడికి అందటం లేదనే వాదన ప్రతిపక్షాల్లో వినిపిస్తోంది..మరీ ఈ పథకం అయినా అందరికి లబ్ధి చేకూరుస్తుందో లేదో వేచి చూడాలి…లబ్ధిదారులంతా త్వరిగతిన ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news