ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం..పోలవరం పూర్తి చేస్తాం – జైరాం రమేష్

-

ఉమ్మడి ఏపి విభజనకు TDP,YCP,BJP, అందరు అంగీకరించాయని.. కానీ విభజన వల్ల కాంగ్రెస్ ఏపి లో నశించిపోయిందని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. అందుకే మేము అధికారం లోకి వస్తే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తాం..పోలవరం ను జాతీయప్రాజెక్ట్ గా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. తెలంగాణలో VRSకి రెడీగా వున్న TRS- కాంగ్రెస్ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు.

119 నియోజకవర్గాలలో పోటీ చేయడానికి తెలంగాణ BJPకి అభ్యర్ధులు వున్నారా ? KCR జాతీయ పార్టీ కలలు తెలంగాణకే పరిమితమన్నారు. 8వ తెలంగాణ నిజాం KCR ..BRS పేరుతో VRS కి రెడీ అవుతున్నారని..TRS ఓటమి ఖాయమని చురకలు అంటించారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ సర్కార్ అని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news