స్కిల్ స్కామ్ లో చంద్రబాబు, లోకేష్ లను అరెస్ట్ చేయాలి – జక్కంపూడి రాజా

-

స్కిల్ స్కామ్ లో చంద్రబాబు, లోకేష్ లను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. స్కిల్ స్కేమ్ కు పాల్పడింది చంద్రబాబు, అతని కుమారుడు లోకేషే..ప్రజా ధనాన్ని నోక్కేసి రికార్డులు మాయం చేశారన్నారు. దోచుకో.. పంచుకో.. తినుకో క్రింద వ్యవహారం నడిచినది.. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ చంద్రబాబు అని ఆరోపణలు చేశారు.

ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో టిడిపి హయాంలో రాష్ట్రంలో భారీ స్కాం జరిగింది.. 370 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కేల్లో చంద్రబాబు సూత్రధారి అని విమర్శలు చేశారు. సిమెంట్ వాస్తు ఒప్పందం పేరిట సెల్ కంపెనీ ఏర్పాటు చేసుకున్న టిడిపి నేతలు… 3000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఆరు క్లస్టర్లు ఏర్పాటు చేసి నైపుణ్యాభివృద్ధి చేస్తామని హామీలు చేశారన్నారు. ఒక్క రూపాయి కూడా నైపుణ్య అభివృద్ధి కోసం ఖర్చు చేయని చంద్రబాబు ప్రభుత్వం అని ఫైర్‌ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.

Read more RELATED
Recommended to you

Latest news