పిఠాపురం నుంచి జనసేన ఎన్నికల శంఖారావం.. పోస్టర్ రిలీజ్

-

మరో రెండు నెలల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు తమ ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఆయా పార్టీలు ప్రణాళికలను రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న వైసీపీని గద్దే దించేందుకు.. కూటమిగా ఏర్పడ్డ జనసేన, తెలుగుదేశం పార్టీ ,బిజెపి విపరీతంగా ప్రయత్నిస్తున్నాయి.

ఇక పొత్తులపై క్లారిటీ రావడంతో జనసేన ప్రచారానికి సిద్ధం అవుతుంది. జనసేనాని పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఈ నెల 30 నుంచి ఎన్నికల ప్రచారం చేయనుంది.ఈ క్రమంలోనే జనసేన ఎన్నికల శంఖారావాన్ని పిఠాపురం నుంచి మోగించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎన్నికల శంఖారావం పోస్టర్ ను జనసేన రిలీజ్ చేసింది. కాగా ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లా వైరల్ అవుతుండగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news