నేడు జనసేన లాంగ్ మార్చ్..

-

జనసేన పోరాటం ఫలించింది. ఆదివారం నిర్వహించనున్న లాంగ్ మార్చ్‌కు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఇసుక సమస్యపై పోరుబాటకు జనసేన పార్టీ సన్నద్ధమైంది. ఇసుక కొరతను నిరసిస్తూ భవన నిర్మాణ కార్మికులకు అండగా విశాఖపట్నంలో ఆదివారం లాంగ్‌ మార్చ్‌ నిర్వహించనుంది. ఇసుకను వెంటనే అందుబాటులోకి తేవాలని, ప్రస్తుతం ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు ఆర్థికంగా సాయం చేయాలనే డిమాండ్‌తో ఈ నిరసన కార్యక్రమం చేపడుతోంది.

మధ్యాహ్నం మూడు గంటలకు మద్దిలపాలెం జంక్షన్‌ నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు పవన్‌కల్యాణ్‌ నేతృత్వంలో భవన నిర్మాణ కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల సహకారం కోరారు. బీజేపీ, టీడీపీ ఇందులో పాల్గొనేందుకు అంగీకారం తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news