వెల్లంపల్లి.. వెల్లుల్లిపాయ, బండి.. చామంతి.. అవంతి: మంత్రులపై పవన్ సెటైర్లు

-

పోలీసుల కష్టాలు నాకు తెలుసని.. ఒక్కోసారి వాళ్ల ప్రవర్తన మనకు నచ్చకపోవచ్చని.. అయితే ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తారని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం వల్ల ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల కోర్టులో నిలుచోవాల్సి వచ్చిందని విమర్శించారు. ఈ వెల్లంపల్లి వెల్లుల్లి పాయలకి, బండి.. చామంతి.. అవంతి.. గోడకు కొడితే బంతి అంటూ మంత్రులపై సెటైర్లు వేశారు. ఒక ఐపీఎస్ అధికారికి ఉన్న నాలెడ్జ్ మీకు ఉంటుందా…? అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లు మంత్రులు అవ్వడం కర్మ అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో పారిశ్రామిక వేత్తలు దెబ్బతిన్నారని.. అమరావతి రైతులను పొట్టగొట్టారని.. ఏమిటని ప్రశ్నిస్తే న్యాయవ్యవస్థను తప్పుబట్టారని.. పోలీసులను వాడుకుంటూ వారిని చెడ్డవాళ్లను చేశారని వైసీపీని విమర్శించారు. సీఐని కొడతారని మంత్రి భయపెడతారని.. చిత్తూర్ లో ఓ సీఐ కాలర్ పట్టుకున్నారని, చొక్కా విప్పి కొడతామని మంత్రి బెదరిస్తారని.. వైసీపీ ఎంపీ కానిస్టెబుల్ ని కొట్టారని విమర్శించారు. పోలీసులు కూడా భయపడే స్థాయికి వెళ్లారని పవన్ కళ్యాణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news