వృద్ధరైతుపై జవాన్ లాఠీ దెబ్బ.. వైరల్ అవుతున్న ఫోటో..

-

వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఛలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా తమ గొంతు వినిపించడానికి దేశవ్యాప్త రైతులందరూ ఢిల్లీకి పయనమయ్యారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతుల నిరసనలని నిలిపివేయడానికి భారత సైన్యాన్ని రంగంలోకి దింపింది. రైతులు నిరసన చేపట్టకుండా ఉండడానికి జవానులు లాఠీ ఝళిపించాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో వృద్ధ రైతుపై లాఠీతో కొడుతున్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది. దేశానికి అన్నం పెట్టే రైతును, దేశ సరిహద్దుల్లో నిలబడి దేశానికి రక్షణ కవచంలా ఉండే జవాను లాఠీతో కొడుతున్న ఫోటో అందరినీ కంటతడి పెట్టించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఫోటోని షేర్ చేస్తూ, బీజేపీ పై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ అధికారం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తమ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news