కేసీఆర్ లాగానే కేటీఆర్ పిట్టకథలు చెబుతున్నాడు – మంత్రి జోగి రమేష్ కౌంటర్

-

ఏపీలో కరెంట్‌, నీళ్లు సరిగా లేవని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఏపీపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. వరుసగా.. వైసీపీ నేతలు స్పందిస్తున్నారు.. కేసీఆర్‌ లాగా.. మంత్రి కేటీఆర్‌ కూడా పిట్టకథలు చెబుతున్నాడని ఏపీ మంత్రి జోగి రమేష్‌ ఫైర్‌ అయ్యారు.

jogi ramesh

ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని.. జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్‌ కు సవాల్‌ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి.. ఓర్వలేకే కేటీఆర్‌ ఇలాంటి వ్యాక్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్‌. ఏపీ అభివృద్దిని చూసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాననంటూ చెప్పుకొచ్చారు. ఏపీలో ఎలాంటి సమస్యలు లేవని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పిన విధంగానే.. ఆయన కొడుకు కేటీఆర్‌ కాకమ్మ కథలు చెబుతున్నాడని మండి పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news