ల్యాండ్, సాండ్, మైనింగ్ దోపిడి చేసే వారు టీఆర్ఎస్ మంత్రులుగా ఉన్నారు: రేవంత్ రెడ్డి

-

ల్యాండ్, సాండ్, మైనింగ్, వైన్, కబ్జాలు, రేప్ లు, మర్డర్లు చేసేవారు టీఆర్ఎస్ మంత్రి వర్గంలో ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నిన్నటికి నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోలీసులను బూతులు తిట్టారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఎనిమిదేళ్లుగా తెలంగాణ పోరాట సంస్కృతి విధ్వంసం చేసి దోపిడి, దొంగతనాలు, మానభంగాలు చేసే సంస్కృతిని తీసుకువచ్చింది టీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. నల్లగొండలో ఉన్న 12 ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. దళారులు, మిల్లర్ల చేతిలో రైతులు మోసపోతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల రూ. 1960 గిట్టుబాటు ధర రావాల్సిన రైతులు కేవలం రూ. 1400 లకే అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిరిసిల్ల, సిద్ధిపేటల్లో అకాాల వర్షాల వల్ల ధాన్యం తడిస్తోందని… రాష్ట్ర ప్రభుత్వమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఉన్న మోదీ… గల్లీలో ఉన్న కేడీ ఇద్దరు రైతుల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news