టిఆర్ఎస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి జూపల్లి కృష్ణారావు !

-

టిఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. గత కొంతకాలంగా టిఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న జూపల్లి కృష్ణారావు… ఓ జాతీయ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు కొల్లాపూర్ లో జూపల్లి కృష్ణారావు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల ఖమ్మం పర్యటన చేసిన అనంతరం మండలాల వారీగా తన వర్గీయులతో జూపల్లి భేటీ అవుతున్నారు.

భారతీయ జనతా పార్టీలో చేరుతారని కొంతమంది ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీలో చేరతారని మరికొంత మంది వాదన. 9 నెలల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉందని.. తాజాగా జూపల్లి కృష్ణారావు ప్రకటన నాగర్ కర్నూల్ జిల్లా లో హాట్ టాపిక్ గా మారింది. తాను ఏ నిర్ణయం తీసుకున్న ప్రజల కోసమేనని… తన పదవి కోసం ఏనాడు పనిచేయలేదని జూపల్లి వెల్లడించారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే… కచ్చితంగా జూపల్లి కృష్ణారావు టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా మొన్న వనపర్తి జిల్లాలో జరిగిన సీఎం కేసీఆర్ మీటింగ్ కూడా జూపల్లి హాజరు కాని విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news