వైసీపీలోకి చేరిన జూపూడి.. ఆ త‌ర్వాత ఏమ‌న్నారంటే..

-

రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌, పీసీసీ కార్యదర్శి దాసు వెంకట్రావులు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మంగళవారం(నేడు) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్‌గా పనిచేసిన జూపూడి తిరిగి వైసీపీలో చేర‌డం విశేషం.

 

అనంతరం జూపూడి ప్ర‌భాక‌ర్ మీడియాతో మాట్లాడుతూ.. నిర్దిష్ట ఆలోచన లేకుండా గొర్రెల్లా పక్కదారి పట్టామన్నారు. రాజకీయంగా నావైపు జరిగిన కొన్ని తప్పులను సరిదిద్దుకుంటానని స్పష్టం చేశారు. జగన్‌లో ఫెడరల్ క్యాస్ట్రో విధానాలు కనిపిస్తున్నాయన్నారు. ఆంధ్రా ఐరన్‌ మ్యాన్‌ విజయసాయిరెడ్డి అని చెప్పారు. పదవులు ఆశించి వైసీపీలో చేరలేదన్నారు. అలాగే మంచి పరిపాలన రావాలని, రాజన్న పాలన తెస్తాడని ప్రజలు సీఎం జగన్‌ను ఆశీర్వదించారని మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news