ప్రజాశాంతి పార్టీలో చేరితే..పవన్ ను ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తా – KA PAUL

-

ప్రజాశాంతి పార్టీలో చేరితే.. పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ బంపర్ ఇచ్చారు. పవన్‌ తన పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానన్నారు. గెలిపించలేకపోతే రూ.1,000 కోట్ల నజారానా ఇస్తానన్నారు కేఏ పాల్‌.

పవన్‌ కల్యాణ్‌ సొంతంగా పోటీ చేసినా.. మరే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలవడని ఎద్దేవా చేశారు. పవన్‌ కళ్యాణ్ తన జనసేన పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరాలని కోరారు. పవన్‌ కల్యాణ్‌ బీజేపీతో పొత్తులో ఉండి బైబిల్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని చూరకలు అంటించారు కేఏ పాల్‌.

రాహుల్‌ గాంధీ మాయ మాటలు విని ప్రజలు మోసపోయేందుకు సిద్ధంగా లేరని కేఏ పాల్‌ అన్నారు. కాంగ్రెస్‌కు దేశంలో ఎక్కడ డిపాజిట్ లు రాలేదని, మీరు దేశాన్ని, ప్రజలను మోసం చేశారు… అందుకే మీకు ఈ శిక్ష అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news