రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ తేలేని బీజేపీ నాయకులు ఎందుకు ఎగిరిపడుతున్నారు – కడియం శ్రీహరి.

-

తెలంగాణ ప్రయోజనాల కోసంపోరాడాల్సిన బీజేపీ నాయకులు ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదని… రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా తేలేని బీజేపీ నేతలు ఎందుకు ఎగిరిపడుతున్నారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. విభజన హామీలను అమలులో కూడా బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. బయ్యారం ఉక్క ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని కూడా బీజేపీనేతలు తేలేకపోయారని విమర్శించారు. బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకు ఒక్క ప్రయోజనం చేకూరలేదని అన్నారు.

దేశంలో సంక్షేమ పథకాల్లో తెలంగాణ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ పై బీజేేపీ మంత్రులే ప్రశంసలు కురిపించారని ఆయన గుర్తు చేశారు. రైతుబంధు, రైతురుణ మాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని..రైతు సంక్షేమాన్ని టీఆర్ఎస్ కట్టుబడిందన్నారు. 8 విడతల్లో 80 వేల కోట్లను రైతుబంధు ఇచ్చామన్నారు. ఇలాంటి సాహసోపేత నిర్ణయాలను తీసుకోవడంలో కేసీఆర్ కే సాధ్యం అని కడియంశ్రీహరి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news