BREAKING : బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌ కు కరోనా పాజిటివ్‌

-

కరోనా థర్డ్‌ ప్రపంచ దేశాలను కుదేపిస్తోంది. ఇప్పటికే ఈ థర్డ్‌ వేవ్‌ 99 దేశాలకు పైగా సోకిందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక మన ఇండియాలోనూ ఈ మహమ్మారి కరోనా విలయ తాండవం చేస్తూనే ఉంది. ముఖ్యం ఈ కరోనా మహ మ్మారి సెలబ్రీటీలు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు, సినీ తారలు, ఇలా చాలా మంది వణికిస్తోంది.

ఇక తాజా గా బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో హీరోయిన్‌ కాజోల్‌.. హోం క్వారంటైన్‌ లోకి వెళ్లింది. వైద్యులు చెప్పిన ప్రకారం.. ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటుంది. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్‌.. తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసింది.

” నాకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. గత రెండు రోజుల నుంచి ముక్కు కారడం, అసహనం నాకు ఉండేది. ఈ నేపథ్యంలోనే తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో నాకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. అందరూ జాగ్రత్తగా ఉండండి ” అంటూ పేర్కొంది కాజోల్‌.

Read more RELATED
Recommended to you

Latest news