వ్యవసాయం గురించి లోకేష్ కు అసలు ఏం తెలుసు ? : మంత్రి కాకానీ

-

సి.ఎం. జగన్‌ మోహన్‌ రెడ్డికి నారా లోకేష్ లేఖ రాయడం విడ్డూరం గా ఉందని.. వ్యవసాయం గురించి లోకేష్ కు ఏమి తెలుసు అని చురకలు అంటించారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఆరి పోతున్న టిడిపి దీపాన్ని చేతులు అడ్డుపెట్టి కాపాడేందుకు పవన్ కళ్యాణ్ యత్నిస్తున్నారని.. దిగుబడి..వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంట నష్టపోతే వారికి కూడా నష్టపరిహారం ఇస్తున్నామని పేర్కొన్నారు.

రైతులకు మేలు జరుగుతుంటే తట్టుకోలేక పోతున్నారని.. టిడిపి హయాం లో ఎప్పుడైనా ఇంత పరిహారం ఇచ్చారా..అని నిలదీశారు. దమ్ముంటే వివరాలు చెప్పండి… చంద్రబాబు హయాం లో బీమా ఇవ్వకుండా ఎగ్గొట్టి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులు బాగుంటే చంద్రబాబు తట్టుకోలేరని.. చంద్రబాబుకు దమ్ము ఉంటే రైతుల కోసం ఏమి చేశారో చెప్పాలని సవాల్‌ విసిరారు. దోపిడీ పథకాలు తప్ప ఉపయోగపడేదేమీ చేయలేదని.. రుణ మాఫీ పేరుతో మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అన్ని రకాల బకాయిలు పెట్టారని.. జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని అందించారన్నారు. అన్ని పథకాలను పారదర్శకంగా ఇస్తున్నామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news