సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోల‌పై కంగనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

-

అందాల ముద్దుగుమ్మ కంగనా రనౌత్ గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఏక్ నిరంజన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఏక్ నిరంజన్ సినిమా తర్వాత కంగనా రనౌత్ బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. ప్రస్తుత కూడా కంగనా రనౌత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతోంది. ఇలా సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ ముద్దుగుమ్మ నిత్యం ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీతో వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది.

గత కొంతకాలం క్రితం ఏకంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతోనే చిన్న సైజ్ యుద్ధం చేసిన కంగ‌నా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సౌత్ ఇండియా స్టార్ హీరోల‌ను ప్ర‌స్తావిస్తూ కంగ‌నా చేసిన ఈ పోస్ట్ ప్ర‌స్తుతం ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీని షేక్ చేస్తోంది.
ఇక వివరాల్లోకి వెళితే… సౌత్ ఇండియా హీరోలు అయిన య‌ష్‌తో పాటు అల్లు అర్జున్ ఫోటోల‌తో కంగానా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోతో పాటు పుష్ప మూవీ లోని ఊ అంటావా..ఉ ఉ అంటావా అనే సాంగ్‌ను యాడ్ చేశారు కంగ‌నా. ఈ పోస్ట్‌తో పాటు.. సౌత్ కంటెంట్‌తో పాటు సూప‌ర్ స్టార్స్‌లో ఇంత‌లా ఆవేశం ఉండ‌డానికి కొన్ని కార‌ణాలు ఉన్నాయి… అవి ఏంటంటే…

1) ఈ స్టార్ హీరోలు భారతీయ సంస్కృతిలో చాలా లోతుగా పాతుకు పోయారు.

2) ఆ హీరోలు తమ ఫ్యామిలీ లను ప్రేమిస్తారు, సంబంధాల విషయంలో వెస్టర్న్ దేశాలను అనుకరించకుండా, వాటిని నిలుపుకుంటారు.

3) వారి అభిరుచి, వృత్తి నైపుణ్యం అసమానమైనది.

అటు కంగ‌నా ర‌నౌత్‌ రాసుకొచ్చింది. ఇక ఈ పోస్టు చివ‌రిలో బాలీవుడ్ ఇండ‌స్ట్రీని ప్ర‌స్తావిస్తూ కంగ‌నా ర‌నౌత్‌ కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ చేశారు. సౌత్ హీరోల‌ను బాలీవుడ్ వారు భ్ర‌ష్టు ప‌ట్టించ‌డానికి అనుమ‌తించ‌కూడ‌దంటూ కంగ‌నా ర‌నౌత్‌ చేసిన పోస్ట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news