కరణ్ జొహార్ కి షాక్ ఇచ్చిన కంగనా.. పద్మశ్రీ వెనక్కయితీసుకోండి..!

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రముఖ ఫిలింమేకర్ కరణ్ జొహార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినీ కెరీర్‌‌ను కరణ్ నాశనం చేశాడని, తద్వారా అతడి ఆత్మహత్యకు పరోక్ష కారకుడయ్యాడని ఆమె ఆరోపించారు. అంతేకాదు తనను కూడా కరణ్ ఓ అంతర్జాతీయ వేదిక నుంచి బెదిరించారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కరణ్ జొహార్‌కు ఇచ్చిన పద్మశ్రీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆమె కోరారు.

ఉరీ ది సర్జికల్‌ స్ట్రైక్ చిత్ర వివాద సమయంలో పాకిస్తాన్ కు మద్దతిచ్చారు. ఇప్పుడు భారత సైన్యాన్ని అవమానపర్చే విధంగా యాంటీ నేషనల్ చిత్రం నిర్మిస్తున్నారంటూ కంగనా రనౌత్ ట్వీట్ చేసి సంచలనం సృష్టిస్తోంది. ఈయేడాది సినీ రంగం నుంచి కరణ్ జోహార్‌ కు పద్మశ్రీ బిరుదు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news